వ్యవసాయ కూలీ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కూలీ అనుమానాస్పద మృతి

Published Sun, Aug 30 2015 7:27 PM

daily labour suspicious death in kurnool district

కర్నూలు: ఓ వ్యవసాయ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడానికి చెందిన మద్దిలేటి బతుకు దెరువుకోసం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాడు. జిల్లాలోని మందకల్ మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనిచేస్తూ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement