‘చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు’ | "Chandrababu, KCR will be sentenced in the hands of the people ' | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు’

Oct 29 2016 2:35 AM | Updated on Aug 14 2018 10:54 AM

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది.

సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ సహజ వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇద్దరు సీఎంలు పిరికిపందల యుద్ధనీతిని అమలు చేస్తున్నారని.. వెంటనే దీన్ని మార్చుకోవాలని హెచ్చరించింది.

మావోయిస్టు పార్టీ ఖమ్మం-కరీంనగర్-వరంగల్ జిల్లాల కార్యదర్శి దామోదర్ పేరుతో శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఏఓబీ ఎన్‌కౌంటర్ బూటకమని, ఇది మావోయిస్టు పార్టీకి నష్టమేనని, కానీ కొద్దిరోజుల్లోనే నిలదొక్కుకుని తిరిగి విస్తరిస్తామని, ప్రజాద్రోహులను ఖతం చేస్తామని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement