కదంతొక్కిన కార్మిక లోకం | bandh success | Sakshi
Sakshi News home page

కదంతొక్కిన కార్మిక లోకం

Sep 2 2016 10:07 PM | Updated on May 3 2018 3:20 PM

కదంతొక్కిన కార్మిక లోకం - Sakshi

కదంతొక్కిన కార్మిక లోకం

కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం స్తంభించాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

విశాఖపట్నం : కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం స్తంభించాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రవాణా వ్యవస్థపై బంద్‌ ప్రభావం పడింది. పారిశ్రామిక వాడలు బోసిపోయాయి. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ కార్మికులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 12 డిమాండ్లపై కార్మికలోకం గొంతెత్తింది. కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. హెచ్‌పీసీఎల్,బెల్,ఎన్‌టీపీసీ,డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్,విశాఖ పోర్టు కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తుగా కార్మిక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ అన్ని చోట్ల విజయవంతంగా జరిగింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement