409 మందికి నేడు ప్రశంసాపత్రాల ప్రదానం | appreciation for 409 persons | Sakshi
Sakshi News home page

409 మందికి నేడు ప్రశంసాపత్రాల ప్రదానం

Jan 26 2017 12:17 AM | Updated on Sep 5 2017 2:06 AM

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో సమర్థవంతంగా పని చేసి çమంచి ఫలితాలను రాబట్టిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు గురువారం జిల్లా కలెక్టర్‌ ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో సమర్థవంతంగా పని చేసి çమంచి ఫలితాలను రాబట్టిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు గురువారం జిల్లా కలెక్టర్‌ ప్రశంసాపత్రాలతో సత్కరించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన 409 మందిని ఎంపిక చేశారు. వీరికి పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఉత్తమ సేవకుల్లో 24 మంది జిల్లా అధికారులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement