గుర్తుతెలియని వ్యక్తి మృతి | An unknown person killed | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Oct 2 2016 10:43 PM | Updated on Sep 4 2017 3:55 PM

గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

బద్వేలు–కడప రహదారిలోని కొంగళవీడు సమీపంలో ఉన్న సగిలేరు వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానిక పశువుల కాపరులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామాంజినాయక్, రూరల్‌ ఎస్‌ఐ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.

బద్వేలు అర్బన్‌:  బద్వేలు–కడప రహదారిలోని కొంగళవీడు సమీపంలో ఉన్న సగిలేరు వంతెన కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానిక పశువుల కాపరులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామాంజినాయక్, రూరల్‌ ఎస్‌ఐ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆయనకు 45 నుంచి 50 ఏళ్లలోపు వయసు ఉంటుంది. 5.2–5.3 అడుగుల ఎత్తు ఉంటాడు. తల ముందు భాగంలో బట్టతల ఉంది. తెలుపు, గోధుమ రంగు నిలువు గీతల ఫుల్‌ చొక్కా, ముదురు కాఫీ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. ఎవరైనా హత మార్చి ఇక్కడ పడేసి వెళ్లారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. తిప్పనపల్లె వీఆర్వో చలమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement