రూ.30 లక్షలతో వ్యక్తి అదృశ్యం | a man escape with rs.30 lakshs | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షలతో వ్యక్తి అదృశ్యం

Sep 20 2016 11:30 PM | Updated on Sep 4 2017 2:16 PM

సుమారు రూ.30 లక్షలతో సెక్షన్‌ ఏజెంట్‌ అదృశ్యమైనట్టు ఎస్‌కే లూబ్రికేట్స్‌ యాజమాన్య ప్రతినిధి యర్లగడ్డ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భోగాపురం(పెదవేగి రూరల్‌): సుమారు రూ.30 లక్షలతో సెక్షన్‌ ఏజెంట్‌ అదృశ్యమైనట్టు ఎస్‌కే లూబ్రికేట్స్‌ యాజమాన్య ప్రతినిధి యర్లగడ్డ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌కే లూబ్రికేట్స్‌ కంపెనీలో పనిచేసే సెక్షన్‌ ఏజెంట్‌ వేజు సత్యనారాయణ  ఈనెల 12న డీలర్ల దగ్గర నుంచి సుమారు రూ.30 లక్షల నగదు వసూలు చేసి, ఖాతాలో వేస్తానని చెప్పి, 13వ తేదీ నుంచి కనిపించడం లేదని కోటేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ చిరంజీవి చెప్పారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement