ఇరువర్గాల మధ్య ఘర్షణ: నలుగురికి తీవ్రగాయాలు | 4 injured in land dispute | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల మధ్య ఘర్షణ: నలుగురికి తీవ్రగాయాలు

Jun 1 2016 4:38 PM | Updated on Sep 4 2017 1:25 AM

సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

సూర్యాపేట (నల్గొండ జిల్లా) : సూర్యాపేట మండలంలోని గాంధీనగర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భూమి విషయంలో తలెత్తిన వివాదమే ఈ సమస్య కారణంగా తెలుస్తోంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement