శ్రీవారి దర్శనానికి 12 గంటలు | 12 hours waiting for srivari darsan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Aug 6 2016 11:41 PM | Updated on Sep 4 2017 8:09 AM

ఎంబీసీ–34 రిసెప్షన్‌ కార్యాలయం వద్ద గదుల కోసం భక్తుల నిరీక్షణ

ఎంబీసీ–34 రిసెప్షన్‌ కార్యాలయం వద్ద గదుల కోసం భక్తుల నిరీక్షణ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 57,937 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు

 
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.  సాయంత్రం 6 గంటల సమయానికి 57,937 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 26 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 12 గంటలు,  14 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు.  కేంద్రీయ విచారణ కార్యాలయం, పద్మావతి, ఎంబీసీ–34  రిసెప్షన్‌ కేంద్రాల్లో గదుల కోసం భక్తులు నిరీక్షించారు.  కల్యాణకట్టల వద్ద భక్తులు  తలనీలాలు సమర్పించేందుకు కనీసం రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది.  హుండీ కానుకలు రూ.2.76 కోట్లు లభించాయి.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement