సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జనవరి 3న పంపిణీ చేసే రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డులకు జిల్లా నుంచి 11 మంది పేర్లను సిఫార్సు చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జనవరి 3న పంపిణీ చేసే రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డులకు జిల్లా నుంచి 11 మంది పేర్లను సిఫార్సు చేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, సోషియల్ వెల్ఫేర్, ట్రేబుల్ వెల్ఫేర్ స్కూళ్లలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, డైట్ కళాశాల అధ్యాపకులు, పీఈడీలు, కేజీబీవీ ఎస్ఓలు, సీఆర్టీలతో దరఖాస్తులు స్వీకరించారు.
మండల స్థాయిలో ఎంఈఓ, డివిజనల్ స్థాయిలో డెప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు ఈ దరఖాస్తులను స్క్రూట్నీ చేసి 54 దరఖాస్తులను జిల్లా కమిటీకి పంపారు. కలెక్టర్ చైర్మన్గా, ఎస్ఎస్ఏ పీఓ కన్వీనర్గా ఏర్పాటైన ఈ కమిటీ వాటిని పరిశీలించి 11 మందిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయి అవార్డులకు సిఫార్సు చేసింది. వారిలో హెచ్ఎంల కేడర్లో ఒకరు, హిందీ గ్రేడ్ - 1 పండిట్ ఒకరు, స్కూల్ అసిస్టెంట్ ఒకరు, ఎస్జీటీలో ఒకరు, కేజీబీవీ ఎస్ఓ ఒకరు ఉన్నారు. అలాగే సీఆర్టీలకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్కొక్కరు ఉన్నారు.