భర్తను చంపిన భార్య | Wife Killed Own Husband In Dichpally | Sakshi
Sakshi News home page

భర్తను చంపిన భార్య

Jul 9 2019 11:43 AM | Updated on Jul 9 2019 11:53 AM

Wife Killed Own Husband In Dichpally - Sakshi

నిందితురాలు సాయవ్వ

సాక్షి, ఇందల్‌వాయి: భార్య తన భర్తను హత్య చేసిన ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లెలో జరిగింది. స్థానిక డిచ్‌పల్లి సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాయిడి గంగారాం(53) నాయిడి సాయవ్వ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి వివాహాలు చేసి తమకున్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.

పిల్లల పెళ్లీళ్ల నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన గంగారాం నాలుగు నెలల క్రితమే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో గంగారాం మద్యం తాగినప్పుడల్లా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. తెల్లవారేసరికి గంగారాం మృతదేహం ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

తన భర్తను తానే చంపినట్లు సాయవ్వ ఒప్పుకున్నా.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి సొదరి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement