వీపనగండ్లలో విషాదం

tragedy in veepanagandla - Sakshi

వనపర్తి జిల్లా : వీపనగండ్ల మండలం గోపాలదిన్నె గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్ల రోజా(28) అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసేసింది. అనంతరం తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో  ఇద్దరు కూతుళ్లు వందన(8), లాస్య(5) కూడా మరణించారు. బంధువుల అంత్యక్రియల నిమిత్తం అత్తమామలు పొరుగూరికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top