చదువుకోవడం ఇష్టం లేక... | student suicide | Sakshi
Sakshi News home page

చదువుకోవడం ఇష్టం లేక...

Jan 2 2018 9:01 AM | Updated on Jul 11 2019 5:01 PM

సాక్షి, తాండూరు రూరల్‌: చదువుకోవడం ఇష్టంలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తాండూరు మండలం ఉద్దాండపూర్‌ అనుబంధ మైసమ్మతండాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

కరన్‌కోట్‌ ఎస్‌ఐ రేణుకారెడ్డి కథనం ప్రకారం.. తండాకు చెందిన శంకర్, హన్యాబాయి దంపతుల కుమార్తె శ్రీలక్ష్మి(17) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. తల్లిదండ్రులు వలస వెళ‍్లడంతో ఆమె నానమ్మ శాంతాబాయి వద్ద ఉంటూ చదువుకునేది కొద్ది రోజులుగా శ్రీలక్ష్మి కాలేజీకి వెళ్లకపోవడంతో శాంతాబాయి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీలక్ష్మి గత నెల 29న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు, సోమవారం ఉద్దాండపూర్‌ శివారులో శ్రీలక్ష్మి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి హన్యాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదువుకోవడం ఇష్టం లేకే శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబీకులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement