జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..!

RTC Bus Driver Rash Driving One Died At Jubilee Check Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ వెళ్తున్న సిటీ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top