ఈ దొంగను పట్టిస్తే 50 వేలిస్తాం | Police arrest wanted criminal with Rs 50,000 reward | Sakshi
Sakshi News home page

ఈ దొంగను పట్టిస్తే 50 వేలిస్తాం

Oct 14 2017 8:54 PM | Updated on Oct 15 2017 1:51 AM

Police arrest wanted criminal with Rs 50,000 reward

సాక్షి, హైదరాబాద్‌: ఓ వృద్ధురాలిని చంపి బంగారు నగలతో ఉడాయించిన ఓ నిందితుడు ఏడాదిన్నరగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ దొంగ సమాచారం అందిస్తే 50 వేల నజరాన ఇస్తామని రాచకొండ కమిషనర్‌ పోలీసులు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తమిళనాడులోని తుత్తుకూడి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, డ్రైవింగ్‌  చేస్తూ భార్యతో మెడ్చల్‌లోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో నివసించేవాడు.

గతేడాది మార్చిలో మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బడంగ్‌పేట,వెంకటాద్రి నివాస్‌లో ఒంటిరిగా నివసిస్తున్న నాగమణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె నగలతో ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే అతని భార్యను అదుపులోకి తీసుకున్న మీర్‌పేట్‌ పోలీసులు అతని ఆచూకి కనుగొనడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పోలీసులు నిందితుని సమాచారం తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement