శావల్యాపురంలో వ్యక్తి దారుణ హత్య

One Person Was Murdered In Shavalyapuram - Sakshi

గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలకేంద్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఘంటా ప్రసాద్‌(36) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top