ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి..

Mother Commited Suicide Attempt With Her Two Kids In Buchireddypalem - Sakshi

బుచ్చిరెడ్డి పాలెం: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ తన ఇద్దరు పిల్లల్ని బావిలోకి తోసేసి ఆ తర్వాత తానూ దూకింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా..స్థానికులు గమనించి పార్వతిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతి ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top