
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో దారుణం చోటుచేసుకుంది. గిరిజన బాలికపై బస్సుడ్రైవర్ విశ్వానాథ్ ఆత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలివి.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లుతున్న సమయంలో బస్సు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వీఈపీజెడ్లోని ప్రైవేట్ కంపెనీలో ఈ ఘటన జరిగింది.
బాలిక జీవితాన్ని ఆ ఉన్మాది బేరం ఆడాడు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు రూ. 1.50 లక్షలకు ఇచ్చేందుకు ప్రయత్నాం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారం కేసును సుమోటోగా నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.