తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం | Man Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే విషాదం

Mar 8 2019 9:38 AM | Updated on Mar 8 2019 9:38 AM

Man Commits Suicide in Hyderabad - Sakshi

సంగమేష్‌ (ఫైల్‌)

సుభాష్‌నగర్‌: తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు కంటతడి పెట్టించాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గాజులరామారం డివిజన్‌ బాలయ్యనగర్‌కు చెందిన సాయమ్మ సర్కిల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తుంది. ఈమె ఒక్కొగానొక్క కుమారుడు  సంగమేష్‌(27) ఆటో డ్రైవర్‌. గోపన్‌పల్లికి చెందిన యువతితో సంగమేష్‌కు వివాహం కుదిరింది.

ఈ నెల 8న నిశ్చితార్ధ ముండగా అందు కోసం అన్ని ఏర్పాట్లలో మునిగి పోయారు. గురువారం సాయమ్మ డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. తలుపులు తట్టగా కుమారుడు ఎంతకీ తెరవకపోవడంతో కిటీకీలోంచి చూస్తే సంగమేష్‌ చీరతో పైకప్పు రాడ్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. తలుపులు బద్దల కొట్టి సంగమేష్‌ను కిందకు దించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న జగద్గిరిగుట్ట ఎస్సై రాములు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టమార్టమ్‌ నిమితం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement