ప్రియుడు మోసగించాడని ప్రేయసి.. ప్రేయసి కోసం..
సాక్షి, కృష్ణా: ప్రియుడు మోసగించాడన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేయసి ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న విషయం తెలుసుకున్న ప్రియుడు సైతం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని తిరువూరులో చోటుచేసుకుంది. వివరాలమేరకు.. తిరువూరుకు చెందిన తగరం నవ్య(19) అనే యువతి తన ప్రేమికుడు కొత్తపల్లి డాని(23) మోసగించాడన్న మనస్తాపంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.
నవ్య నిద్రమాత్రలు మింగిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను 108ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యకు యత్నించిందని తెలిసి డాని కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో డానిని కూడా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.