విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్‌ఎస్‌ | INS condemns registration of FIR against scribe | Sakshi
Sakshi News home page

విలేకరిపై కేసును ఖండించిన ఐఎన్‌ఎస్‌

Jul 12 2018 3:19 AM | Updated on Oct 5 2018 9:09 PM

INS condemns registration of FIR against scribe - Sakshi

న్యూఢిల్లీ: మలయాళ టీవీ చానల్‌ ‘మాతృభూమి న్యూస్‌’కు చెందిన ప్రముఖ యాంకర్‌పై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేరళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడాన్ని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ(ఐఎన్‌ఎస్‌) ఖండించింది. ఇలాంటి చర్యలతో కేరళ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాపై ఇలాంటి దాడులు పత్రికా స్వేచ్ఛకు, స్వతంత్రంగా ఆలోచించి, మాట్లాడే సంస్కృతికి గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని ప్రభుత్వానికి ఐఎన్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement