మర్రిగూడలో దారుణం

Husband Murdered His Wife In Nalgonda - Sakshi

మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్యపాలిట భర్తే యముడయ్యాడు. నిద్రపోతున్న భార్య భూతం నర్సమ్మ(40)ను భర్త భూతం యాదయ్య(46) గొడ్డలితో నరికి చంపాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన అనంతరం భర్త పరారయ్యాడు. వీరికి ఇద్దరు సంతానం. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top