తాగొద్దన్నదని..

Husband Killed Wife in Hyderabad - Sakshi

మారేడుపల్లి : తాగుడు మానుకోవాలని కోరినందుకు ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి భార్యను హత్య చేసిన సంఘటన మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మహంకాళి  ఏసీపీ వినోద్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లి వాల్మీకినగర్‌కు చెందిన సన్ని విట్లాన్, అదే ప్రాంతానికి చెందిన సత్యవతి (27) 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.సత్యవతి అదే ప్రాంతంలో ఇళ్లల్లో పాచిపని చేస్తుండగా సన్ని విట్లాన్‌ దుకాణాల్లో పనిచేసేవాడు.

సన్ని విట్లాన్‌ గత కొంతకాలంగా తాగుడుకు బానిసకావడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సన్ని డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి అతిగా మద్యంసేవించి వచ్చిన అతను భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం సత్యవతి నిద్రిస్తుండగా గొంతు నులిమి హత్యచేసి, ఇంటిబయట తాళం వేసి పరారయ్యాడు. మరుసటిరోజు (మంగళవారం) రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అతను తన తండ్రి సురేందర్‌కు తన భార్యను హత్యచేసినట్లు చెప్పి పరారయ్యాడు. దీంతో సురేందర్‌ మృతురాలి తల్లితండ్రులు, మారేడుపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top