మెట్రో పిల్లర్‌ దగ్గర కాల్పుల కలకలం | Fire between Police Gangsters at Delhi Metro Station | Sakshi
Sakshi News home page

Nov 21 2017 1:29 PM | Updated on Oct 16 2018 5:07 PM

Fire between Police Gangsters at Delhi Metro Station - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. మంగళవారం ఉదయం ద్వారకా మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ నెంబర్‌-768 దగ్గర పోలీసులకు-క్రిమినల్స్‌ కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. 

ఓ భవనంలో క్రిమినల్స్ దాగున్నారన్న సమాచారంతో పంజాబ్‌-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. సోదాలు నిర్వహించేందుకు వెళ్లగా నేరస్థులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. చివరకు ఐదుగురు క్రిమినల్స్‌ను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి 12 పిస్టోల్స్‌, 100 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement