దారుణమైన యాక్సిడెంట్‌.. మహిళ మృతి! | Sakshi
Sakshi News home page

దారుణమైన యాక్సిడెంట్‌.. మహిళ మృతి!

Published Sun, Feb 10 2019 8:17 PM

Bus And Lorry Accident In Kanchipuram - Sakshi

సాక్షి, చెన్నై : కాంచీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం కొద్దిసేపట్లోనే వైరల్‌ అయింది. లారీ బీభత్సం సృష్టించడంతో ఓ మహిళ నుజ్జునుజ్జు అయింది. వివరాలు.. రద్దీగా ఉన్న ప్రాంతంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి లారీ దూసుకొచ్చింది. దీంతో బస్సుకు, లారీకి మధ్యలో ఓ మహిళ ఇరుక్కుపోయింది. అక్కడకిక్కడే ఆ మహిళ మృతి చెందింది. అయితే లారీ చక్రాల కింద పడ్డ మరో వ్యక్తి మాత్రం చావు నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Advertisement
Advertisement