ముగ్గురు మావోయిస్టులు హతం

Three Maoists killed in Jharkhand encounter - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. గుమ్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కూంబింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు నిన్న పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. మహవగరీ జరిపిన తనిఖీల్లో 17 టిఫిన్‌ బాంబులు, 200లకు పైగా డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top