డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ | Yes Bank To Raise $1.2 bn By Dec Give Board Representation To New Investors | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ ఆఖరుకల్లా నిధుల సమీకరణ

Nov 4 2019 4:22 AM | Updated on Nov 4 2019 4:22 AM

Yes Bank To Raise $1.2 bn By Dec Give Board Representation To New Investors - Sakshi

ముంబై: నిధుల వేటలో ఉన్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌.. ప్రతిపాదిత రూ. 1.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 8,462 కోట్లు) పెట్టుబడుల సమీకరణ ప్రక్రియను డిసెంబర్‌ ఆఖరునాటికల్లా పూర్తి చేయనుంది. అలాగే, కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో కూడా స్థానం కల్పించాలని భావిస్తోంది. నిధుల సమీకరణ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నామని, సుమారు 3 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 21,156 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారని యస్‌ బ్యాంక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నార్త్‌ అమెరికన్‌ ఫ్యామిలీ ఆఫీస్‌’ ఇప్పటికే 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆఫర్‌ ఇచి్చంది.

దీనిపై నవంబర్‌ ఆఖరులోగా ఆ సంస్థకు తమ అభిప్రాయం తెలియజేయాల్సి ఉంటుందని విలేకరులకు యస్‌ బ్యాంక్‌ సీఈవో రవ్‌నీత్‌ గిల్‌ తెలిపారు. ఆ సంస్థ నుంచి లేదా పలువురు ఇన్వెస్టర్లందరి నుంచి కలిపి డిసెంబర్‌ ఆఖరు నాటికి నిధుల సమీకరణ జరపగలమని పేర్కొన్నారు. రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవాలని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల అవసరాలకు ఈ నిధులు సరిపోగలవని గిల్‌ చెప్పారు.  మరోవైపు, సింగపూర్‌ సంస్థ డీబీఎస్‌.. తమ బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉందంటూ వచి్చన వార్తలను గిల్‌ కొట్టిపారేశారు. అటు డీబీఎస్‌ కూడా ఈ వార్తలను ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement