కమోడిటీ ఎక్సేంజ్‌ లేవాదేవీ చార్జీల పెంపు  | Sebi hikes transaction charges on commodity exchanges  | Sakshi
Sakshi News home page

కమోడిటీ ఎక్సేంజ్‌ లేవాదేవీ చార్జీల పెంపు 

Jan 3 2018 8:18 PM | Updated on Jan 3 2018 8:20 PM

Sebi hikes transaction charges on commodity exchanges  - Sakshi

సాక్షి,  ముంబై:  కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)  కమోడిటీ ఎక్సేంజ్‌  చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.  ఈ నోటిఫికేషన్‌ వెలువడిన 30రోజులకు  కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. 

 దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు.  వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం  సెబీ ఈ నిర్ణయం  తీసుకుంది. ఒక కాంట్రాక్ట్‌ లోని  'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్‌ నుండి  లోయస్ట్‌ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని  తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో  కమోడిటీ డెరివేటివ్‌ ఎక్స్చేంజ్‌ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా  ఉంది.  

ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్‌ తో విలీనం  తరువాత. 2015నుంచి కమోడిటీ  ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్  లావాదేవీల చార్జీల వసూలుపై  నిబంధనలను విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement