హైదరాబాద్‌లో ఒప్పో ఆర్‌అండ్‌డీ కేంద్రం

Oppo sets up R&D centre in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో హైదరాబాద్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఒప్పోకు ప్రపంచవ్యాప్తంగా 4 ఆర్‌అండ్‌డీ కేంద్రాలున్నాయి.  ఈ కేంద్రంలో నూతన ఆవిష్కరణలతో పాటూ భవిష్యత్తు ఉత్పత్తులకు టెక్నాలజీలను అభివృద్ధి చేస్తామని ఒప్పో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, ఆర్‌అండ్‌డీ హెడ్‌ తస్లీమ్‌ ఆరీఫ్‌ తెలిపారు. ఈ కేంద్రంలో ఐఐటీలు సహా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి నిపుణులను నియమించుకుంటామని.. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తుల తయారీ సులువవుతుందని చెప్పారాయన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top