న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.
రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి.
ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి.
ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి.


