
ఒప్పో ఎఫ్3 ప్లస్ ధర భారత్లో తగ్గింది. పరిమిత కాల వ్యవధిలో ఈ ఫోన్ఫై ధర తగ్గిస్తున్నట్టు ఒప్పో ప్రకటించింది. ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ ధరను రూ.6000 మేర తగ్గించి, రూ.24,990కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర 30,990 రూపాయలుగా ఉంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు బుధవారం ఈ తగ్గింపు ధరలో ఒప్పో ఎఫ్3 ప్లస్ను కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ తెలిసింది. జూన్లో కూడా తాత్కాలికంగా ఈ ఫోన్ ధరను ఒప్పో తగ్గించింది.
ఒప్పో ఎఫ్3 ప్లస్ బిగ్గెస్ట్ హైలెట్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా. ఒకటి 16 మెగాపిక్సెల్, రెండు 8 మెగాపిక్సెల్ సెన్సార్లతో దీన్ని రూపొందించింది. 6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1.95గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 653 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీనిలో ఫీచర్లు.