2 కోట్ల మైలు రాయిని దాటిన మారుతీ

Maruti Suzuki crosses 2 crore production milestone - Sakshi

34 ఏళ్ల 6 నెలలలో రికార్డ్‌

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) సరికొత్త మైలురాయిని అధిగమించింది. గురుగ్రామ్, మానెసర్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయిన వాహనాల సంఖ్య 2 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.1983 నుంచి ఉత్పత్తిని కొనసాగిస్తున్న ఈ సంస్థ 34 ఏళ్ల 6 నెలలకాలంలో ఈ ఘనతను సాధించినట్లు తెలిపింది.

ఇంతటి రికార్డును సాధించిన తొలి దేశీయ కంపెనీగా చరిత్ర సృష్టించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ – సీఈఓ కెనిచి అయుకవా వెల్లడించారు. ప్రస్తుతం 16 మోడ    ల్‌ కార్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తం గా 100 దేశాలకు ఎగుమతులు కొనసాగిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top