సెల్టోస్‌ ధర పెరిగింది | Kia Seltos Prices Hiked By Up To Rs 35000 | Sakshi
Sakshi News home page

సెల్టోస్‌ ధర పెరిగింది

Jan 4 2020 4:00 AM | Updated on Jan 4 2020 4:00 AM

Kia Seltos Prices Hiked By Up To Rs 35000 - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సెల్టోస్‌ ఎస్‌యూవీ కారు ధరలను పెంచింది. మోడల్‌ ఆధారంగా రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు పెంపుదల ఉంటుందని ప్రకటించింది. గతేడాది అగస్టులో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర అంతక్రితం రూ. 9.69 లక్షలు ఉండగా.. పెంపుదల తర్వాత  రూ. 9.89 లక్షలు – 16.29 లక్షలదాకా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా, రెనో సంస్థలు గతనెల్లోనే కార్ల ధరలను పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement