‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు | Infosys co-founder invests in travel app RailYatri | Sakshi
Sakshi News home page

‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు

Apr 28 2016 8:04 AM | Updated on Aug 20 2018 2:35 PM

‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు - Sakshi

‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు

రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్‌సైట్ రైల్‌యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు.

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్‌సైట్ రైల్‌యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. నీలేకనితోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన హీలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ నెట్‌వర్క్స్, బ్లూమ్ వెంచర్స్ కూడా తాజాగా పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయని రైల్‌యాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 2014లో ఆరంభమైన రైల్‌యాత్రి ఇప్పటివరకూ 3 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.20 కోట్లు) సమీకరించినట్లు అంచనా.

రైళ్లలో ప్రయాణిస్తున్నవారి(క్రౌడ్ సోర్సింగ్) మొబైల్ జీపీఎస్ డేటా ఆధారంగా రైళ్లకు సంబంధించిన ప్రయాణ జాప్యాలను ఈ యాప్ అంచనావేసి ఇతర ప్రయాణికులకు అందిస్తుంది. సంబంధిత రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంది. కోచ్ పొజిషన్, ఆన్-టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గనుక తీసుకుంటే అది కన్ఫర్మ్ అవుతుందా లేదా వంటి సమాచారాలను కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఆధార్ పాజెక్టును విజయవంతం చేసిన యూఐడీఏఐ మాజీ చైర్మన్ నీలేకని వంటి టెక్నోక్రాట్ నుంచి పెట్టుబడులు అందుకోవడం తమకు గర్వకారణమని రైల్‌యాత్రి సహ  వ్యవస్థాపకుడు కపిల్ రైజాదా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement