లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

నవంబర్లో 6 శాతం వృద్ధి
మూడు నెలల తర్వాత లక్ష కోట్లపైకి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగాయి. 2017, జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే మూడో అత్యధిక వసూళ్లు. కాగా ఈ వసూళ్లు లక్ష కోట్ల మార్క్ను దాటడం ఇది ఎనిమిదో నెల. అంతకు ముందు రెండు నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన జీఎస్టీ వసూళ్లు పండుగల డిమాండ్ పుణ్యమాని ఈ నవంబర్లో పెరిగాయి. వినియోగం పెరగడాన్ని, జీఎస్టీ అమలు మెరుగుపడటాన్ని పెరిగిన ఈ వసూళ్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి