యూనియన్‌ బ్యాంకుకు రూ.74 కోట్ల టోకరా

CBI registers fraud cases worth Rs 74 crore in Union Bank of India - Sakshi

సాక్షి, ముంబై: 2018 సంవత్సరం  ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల్లో మూడు స్కాంలు, ఆరు మోసాలు అన్నట్టు  గడిచింది. మరో రెండురోజుల్లో ఏడాది ముగియనుండగా తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో మరో  మోసం వెలుగు  చూసింది. ఈ కేసులో సీబీఐ నాలుగు వేర్వేరు కేసులను నమోదు చేసింది. 

యూనియ‌న్ బ్యాంక్ ఫిర్యాదు మేర‌కు సీబీఐ ఈ కేసును న‌మోదు చేసింది. 74 కోట్ల రూపాయల మేర డిఫాల్టర్లు బ్యాంకును మోసగించారని తెలిపింది. కౌశాంబి, ఘజియాబాద్‌లోని కార్పొరేట్‌ బ్రాంచ్‌లలో ఈ మోసం చోటు చేసుకున్నట్టు సీబీఐ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎస్ఎం ఎంటర్ప్రైజెస్, జీనియస్ ఇంపెక్స్, జెబిఆర్ ఇంపెక్స్, జె.ఆర్ ఫుడ్స్ కంపెనీలు డిఫాల్టర్లుగా తేలారని యూనియన్‌ బ్యాంక్‌ రిపోర్టు చేసింది. ఈ మొండి బకాయిలుపై విచారణ చేపట్టాలని సీబీఐని  కోరింది. దీంతో ఈ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై కూడా సీబీఐ  కేసు నమోదు చేసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top