భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం! | Airports Council International reports global passenger traffic growth | Sakshi
Sakshi News home page

భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం!

Aug 25 2016 12:12 AM | Updated on Sep 4 2017 10:43 AM

భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం!

భారత్ ఏవియేషన్ మార్కెట్ విశ్వరూపం!

భారత్ పౌర విమానయాన మార్కెట్ రానున్న కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్లలో ఒకటిగా ఉద్భవించనుందని ఏయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్...

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్ అంచనా
న్యూఢిల్లీ: భారత్ పౌర విమానయాన మార్కెట్ రానున్న కొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్లలో ఒకటిగా ఉద్భవించనుందని ఏయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్‌నేషనల్ (ఏసీఐ) తన తాజా నివేదికలో అంచనావేసింది. పెరుగుతున్న విమానయాన ప్రయాణీకులు ఇందుకు కారణమని తెలిపింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో  విమాన ప్రయాణీకులు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల విషయంలో భారత్, చైనా, కొరియాలోని పెద్ద కమర్షియల్ ఎయిర్‌పోర్ట్‌లు కీలకపాత్ర పోషించనున్నట్లు పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే...

విమానయాన మార్కెట్‌లో  సంస్కరణలు, పటిష్ట ఆర్థిక ఫండమెంటల్స్ కలిసి భారత్‌లో ఈ రంగం గణనీయ వృద్ధికి దోహదపడుతోంది.

ఆసియా-పసిఫిక్‌లో జూన్‌లో విమాన ప్రయాణీకుల సంఖ్య 9.9 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 8.8 శాతం.

2016 తొలి 6 నెలల్లో అంతర్జాతీయ, దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2015 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 8.2% నుంచి 10.1%కి పెరిగింది.

చైనా, భారత్, కొరియాల విషయంలో ప్రయాణీకుల పెరుగుదల శాతాలు వరుసగా 12.1 శాతం, 17 శాతం, 14.1 శాతంగా ఉన్నాయి.

భారత్‌లో ఒక్క దేశీయ ప్రయాణీకుల సంఖ్య మొదటి ఆరు నెలల్లో 20.6 శాతం నమోదైంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ప్రయాణీకుల విషయంలో జూన్‌లో 21.5% వృద్ధి కాగా, వార్షికంగా 4.4%.

భారత్ విమానయాన సరకు రవాణా విషయంలో వృద్ధి 6 నెలల్లో దేశీయంగా 4.1%, అంతర్జాతీయంగా 10.5 శాతంగా నమోదైంది.

ప్పంచ విమానాశ్రయాల సంఘమే ఏసీఐ. 1991లో ఏర్పాటయిన ఈ సంఘంలో 173 దేశాల్లో 1,853 ఎయిర్‌పోర్ట్‌లు నిర్వహిస్తున్న 592 సంస్థలకు సభ్యత్వం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement