రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం! | air asia india offers malaysia ticket below rs 3000 under offer | Sakshi
Sakshi News home page

రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం!

Jun 23 2015 3:59 PM | Updated on Sep 3 2017 4:15 AM

రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం!

రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం!

చవక ధరలకే విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తన బిగ్సేల్లో మరో కొత్త స్కీము ప్రకటించింది. రూ. 3వేలకే విదేశీ ప్రయాణాన్ని అదికూడా పన్నులన్నీ కలుపుకొని అందిస్తామని చెప్పింది.

చవక ధరలకే విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తన బిగ్సేల్లో మరో కొత్త స్కీము ప్రకటించింది. రూ. 3వేలకే విదేశీ ప్రయాణాన్ని అదికూడా పన్నులన్నీ కలుపుకొని అందిస్తామని చెప్పింది. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి ఆగస్టు 31లోగా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో 30 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు.

కొచ్చి నుంచి కౌలాలంపూర్కు రూ. 2,999కే టికెట్ ఇస్తున్నారు.  అలాగే కొచ్చి నుంచి హాంకాంగ్, పెనాంగ్, సింగపూర్ ప్రాంతాలకు రూ. 4,019కే టికెట్ ఉంది. కొచ్చి నుంచి మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ లాంటి ఆస్ట్రేలియా నగరాలకు మాత్రం టికెట్ ధరను రూ. 5,739గా నిర్ణయించారు. వివిధ భారతీయ నగరాల నుంచి అంతర్జాతీయ నగరాలకు కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement