100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి | 100 million to focus on fund raising | Sakshi
Sakshi News home page

100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి

Sep 11 2016 2:08 AM | Updated on Sep 4 2017 12:58 PM

100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి

100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి

కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఈటైలర్ సంస్థ కస్టమ్ ఫర్నిష్.కామ్ రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి సారించింది.

- మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు..
- రూ.10 కోట్లతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లు
- హైదరాబాద్‌లో తొలి సెంటర్ ప్రారంభం
- కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమైజ్డ్ ఫర్నిచర్ ఈటైలర్ సంస్థ కస్టమ్ ఫర్నిష్.కామ్ రూ.100 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి సారించింది. మరో 4 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామని.. ఆ తర్వాతే డీల్‌ను క్లోజ్ చేస్తామని కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుకర్ గంగాడి తెలిపారు. శనివారమిక్కడ తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘1,000-3,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌లో ఇటాలియన్ డిజైన్స్ సోఫా, ఫర్నిచర్‌తో పాటూ కర్టెన్లు వంటివి ఏర్పాటు చేశాం.

స్టోర్‌ను సందర్శించి ఫర్నీచర్‌ను ఎంపిక చేసుకొని అక్కడే ఉన్న కంప్యూటర్ కియోస్క్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చే వీలుంటుంది’ అని వివరించారు. ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో 30 ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను, రెండేళ్లలో వంద స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో మరో 5 హైదరాబాద్‌లో, మిగిలినవి బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్, పుణెల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 1.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో కొంపల్లిలో ఫర్నిచర్ తయారీ ప్లాంట్ ఉందని.. వచ్చే ఏడాది ముగింపు నాటికి ఢిల్లీ, బెంగళూరుల్లో కూడా యూనిట్లను నెలకొల్పుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement