నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
'వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్సీపీ ధ్యేయం'
Apr 10 2014 4:02 PM | Updated on Aug 14 2018 4:21 PM
గుంటూరు: నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమం, వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్ సీపీ ధ్యేయం అని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు చేరుతాయన్నారు. అభివృద్ది కేవలం వైఎస్ జగన్ తోనే సాధ్యమని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. నరసరావుపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్పందన లభించింది.
Advertisement
Advertisement