జగన్ దీక్షకు మద్దతుగా రిక్షా తొక్కిన ఎమ్మెల్యే | YSRCP MLA Jayaramulu drives rickshaw to support YS Jagan | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షకు మద్దతుగా రిక్షా తొక్కిన ఎమ్మెల్యే

Oct 12 2015 6:35 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు పార్టీ అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం రిక్షా తొక్కారు.

బద్వేలు అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జయరాములు పార్టీ అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం రిక్షా తొక్కారు. బద్వేలు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి సిద్ధవటం రోడ్డులోని వినాయకుడి గుడి వరకు రిక్షా తొక్కుకుంటూ వెళ్లారు. 101 కొబ్బరికాయలను రిక్షాలో తీసుకెళ్లి ఆలయం వద్ద కొట్టారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశారు. ఆయన వెంట మాజీ మునిసిపల్ చైర్మన్ మున్నెయ్య, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement