‘నవరత్నలు చూసి ఓర్వలేకపోతున్నారు’ | YSRCP Leader Ramaiah FIres On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘నవరత్నలు చూసి ఓర్వలేకపోతున్నారు’

Dec 17 2018 1:58 PM | Updated on Dec 17 2018 6:57 PM

YSRCP Leader Ramaiah FIres On CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లుగా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ కర్నూల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు బీ.వై రామయ్య విమర్శించారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి బీసీలకు మోసం చేసేందుకే జయహో బీసీ కార్యక్రమం చేపట్టారని అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ బీసీలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న జిల్లాలో పెద్ద ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement