
సాక్షి, దువ్వూరు : ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు దువ్వూరు శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైఎస్ జగన్ ముఖాముఖీ కానున్నారు. అలాగే చాగలమర్రి శివారులో ఆయన ఇవాళ రాత్రి బస చేస్తారు.