పాతాళగంగలో మునిగి యువకుడి మృతి | Youth drowns in pond at Temple | Sakshi
Sakshi News home page

పాతాళగంగలో మునిగి యువకుడి మృతి

May 7 2016 5:15 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు.

శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు. వారు దైవ దర్శనం అనంతరం పాతాళగంగలో ఈత కొడుతుండగా ఓంకార్(20) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఓంకార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మృతుడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన వాడని అతని స్నేహితులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement