యువతి ఆత్మహత్య | Young woman suicide | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Jun 1 2014 12:31 AM | Updated on Sep 2 2017 8:08 AM

యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడదవోలులో శనివారం జరిగిం ది. ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం..

 నిడదవోలు, న్యూస్‌లైన్ : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిడదవోలులో శనివారం జరిగిం ది. ఎస్సై ఎం.సూర్యభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయపేట రామాల యం వీధిలో ఏనుగుల బండారిమేరీప్రసన్న రాణి(18), ఆమె తల్లి మేరీ రాధారాణి నివసిస్తున్నారు. శనివారం ఉదయం రాధారాణి టిఫిన్ తెచ్చేం దుకు హోటల్‌కు వెళ్లింది. టిఫిన్ తె చ్చిన ఆమె తలుపులు లోపల గడియపెట్టి ఉండటంతో చాలా సేపు కుమార్తెను పిలిచించి. అయినా తలుపులు తీయకపోవడంతో కంగారుగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్న ప్రసన్నరాణి కనిపిం చింది.
 
 వెంటనే ఆమెను కిందకు దింపగా అప్పటికే మృతిచెందింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లోని ఓ క్లాత్ షోరూంలో ప్రసన్నరాణి ఐదేళ్ల నుంచి సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. రాయపేటకు చెందిన గున్నాబత్తుల నానాజీ, ప్రసన్నరాణి ప్రేమించుకున్నారు. నానాజీ  మరో యువతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఈనెల 30న నానాజీతో పాటు అతని తండ్రి, సోదరుడు ఆమె ఇంట్లోనే తల్లి రాధారాణి సమక్షంలో పంచాయితీ పెట్టారు. నానాజీ మరో యువతిని పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి లక్ష రూపాయలు ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నరాణి ఆత్మహత్య చేసుకుంది. మృతురా తల్లి  ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని కొప్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement