సెప్టెంబర్ 7వ తేదీన సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్ లోసభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.
హైదరాబాద్: సెప్టెంబర్ 7వ తేదీన సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవోలఅధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనాల్సిందిగా కోరతమన్నారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన చట్టపరంగానైనా సెప్టెంబర్ 7న సభ నిర్వహించి తీరుతామన్నారు.సమ్మె చేస్తున్న ఉద్యోగులే సభలో పాల్గొంటారని అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ పై అందరికీ సమాన హక్కులున్నాయని, సభ ఏర్పాటుకు తెలంగాణ వాదులు సహకరించాలని ఆయన విజ్క్షప్తి చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్ లోల సభ పెడితే తెలంగాణ వాదం దెబ్బతింటుందనే వాదన సరికాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వల్లే మాకు ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.
సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీ నామాలు చేస్తే తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్లే అవకాశం లేదని, అలాగని వెనక్కి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యమం వల్ల రాష్ట్రంలో యథాతథస్థితే ఉంటుందని భావిస్తున్నామని అశోక్బాబు తెలిపారు. తృణమూల్, సీపీఎం, అన్నాడీఎంకే తెలంగాణ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాగా, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేయవద్దని మిగిలిన పార్టీలూ కోరుతున్నాయన్నాయని అశోక్ బాబు తెలిపారు.