20న ‘చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ ప్రారంభం | Sakshi
Sakshi News home page

20న ‘చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ ప్రారంభం

Published Mon, Dec 19 2016 2:28 AM

20న ‘చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ ప్రారంభం - Sakshi

అనంతపురం టౌన్‌ : సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 20న ’చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలోని ఎనికేపాడులోగల చౌక దుకాణం(నంబర్‌–6)లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

కోటి 34 లక్షల కార్డుదారులకు ఉచితంగా ఆరు రకాల సరుకులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 26 వరకు క్రిస్మస్‌ కానుకలు, జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. పంపిణీ సమయంలో నాణ్యతలేని సరుకులను తిరస్కరించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. చంద్రన్న కానుకల కోసం రూ.460 కోట్ల బడ్జెట్‌ కేటాయించామన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement