పండుగైన తప్పదు మరీ..

Vijayawada People Awareness on Coronavirus - Sakshi

విజయవాడ :కొత్త సంవత్సరాది ఉత్సవం.. ‘కోవిడ్‌’ ఆంక్షలతో కళ తప్పింది. కలిసికట్టుగా ఇంటిల్లిపాది సంబరంగా చేసుకోవాల్సిన పండుగ.. కలి‘విడి’గా చేసుకోవాల్సి వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు దాదాపు ఉగాది పండుగకు దూరంగా  ఉంటున్నారు. మరికొందరు మాస్క్‌లు ధరించైనా ఉగాది పచ్చడిని చేసుకుని రుచి చూస్తున్నారు. విజయవాడ రామవరప్పాడులో మాస్క్‌లు ధరించి ముందస్తుగా ఉగాది పచ్చడిని రుచి చూస్తున్న యువతులను చిత్రంలో చూడొచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top