తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు | Vigilance officials raid Tahsildar office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు

Oct 15 2015 4:43 PM | Updated on Apr 4 2019 2:50 PM

ఇళ్ల పట్టాల జారీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం విజిలెన్సు అధికారులు సోదాలు జరుపుతున్నారు.

పాలకొల్లు సెంట్రల్ (పశ్చిమ గోదావరి) : ఇళ్ల పట్టాల జారీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం విజిలెన్సు అధికారులు సోదాలు జరుపుతున్నారు.

విజిలెన్స్ ఏలూరు సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో ఫైళ్ల తనిఖీలు ప్రారంభించారు. స్థానిక లక్ష్మీనగర్‌లో ప్రభుత్వ అందజేసిన ఇళ్లపట్టాలు అనర్హులకు అందాయనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement