ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ | Vasireddy Padma Defended the Accused Encounter in the Disha Case | Sakshi
Sakshi News home page

ఆ సంఘటన గుర్తొచ్చింది : వాసిరెడ్డి పద్మ

Dec 6 2019 11:36 AM | Updated on Dec 6 2019 12:40 PM

Vasireddy Padma Defended the Accused Encounter in the Disha Case - Sakshi

సాక్షి, అమరావతి : దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మ శాంతిస్తుందని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిశకు సత్వర న్యాయం జరిగిందంటూ దోషులకు పడిన శిక్షను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్‌కౌంటర్‌తో వైఎస్సార్‌ హయాంలో జరిగిన సంఘటన మరొకసారి గుర్తుకు వచ్చిందని వెల్లడించారు. స్త్రీలపై జరుగుతున్న పాశవిక దాడులకు ప్రతిగా ఈ ఎన్‌కౌంటర్‌ కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. నిందితులకు పడిన శిక్ష పట్ల దేశ ప్రజలు హర్షిస్తున్నారనీ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాల్లో మార్పు రావాలని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement