రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | two dies in road accident in nellore district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Apr 16 2015 11:10 AM | Updated on Aug 30 2018 3:56 PM

నెల్లూరు జిల్లా నాయుడు పేట సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన గురువారం నెల్లూరు జిల్లా నాయుడుపేట బైపాస్ వద్ద జరిగింది. వివరాలు..పెల్లకూరు మండలం చిల్లకర్రు గ్రామానికి చెందిన వి. సతీష్(21), మునిరాజ్(19)లు ధాన్యం కొలతలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ధాన్యం కొలతలకు వెళ్తుండగా వీరు ప్రమాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement